epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కాకతీయ, కరీంనగర్ భగత్‌నగర్ : నా వెంట నిలబడి భారీ మెజారిటీతో గెలిపించిన 42వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని కరీంనగర్ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్‌నగర్ అయ్యప్ప దేవాలయంలో ఆదర్శ యువజన సంఘం, జైభీమ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు హరిహరక్షేత్రంలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆదర్శ యూత్ క్లబ్, జైభీమ్ యూత్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో నగరంలోని 66 డివిజన్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో అనే ఉత్కంఠ నెలకొనగా 42వ డివిజన్ ప్రజలు మాత్రం తన విజయం ఖాయమని నమ్మకంతో ఎదురుచూశారని గుర్తుచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఆశలు లేకుండా తన గెలుపు కోసం కృషి చేసిన ఆదర్శ యూత్ క్లబ్, జైభీమ్ యూత్ క్లబ్, చైతన్య యూత్ క్లబ్, భగత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత ఎన్నికల మాదిరిగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల్లా ప్రేమాభిమానాలు చూపుతూ తనను ముందుకు నడిపిస్తున్న ప్రజలు ఉండటం తన అదృష్టమన్నారు.డివిజన్ ప్రజలంతా ఏకతాటిపై ఉండి ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉండటం వల్లనే వరుస విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పనిచేశానని, ఇకముందు కూడా అదే విధంగా సేవలు అందిస్తానన్నారు. డివిజన్‌లో డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.భగత్‌నగర్ డివిజన్ నగరంలో ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర డివిజన్ల ప్రజలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. హిందూ, ముస్లిం ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకరి పండుగలను ఒకరు గౌరవించుకునే శాంతి వాతావరణం భగత్‌నగర్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడూ వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తనపై నమ్మకం ఉంచి నగరపాలక సంస్థకు అవసరమైన సూచనలు అందించాలనే ఉద్దేశంతో మళ్లీ డిప్యూటీ మేయర్ పదవి అప్పగించారని తెలిపారు. ఇందుకు భగత్‌నగర్ ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు డొంకిని జయరాం, సోడే ధనరాజ్, సోమిడి మల్లేశం, బాలు, జైభీమ్ యూత్ క్లబ్ సభ్యులు అరికిల్ల శంకర్, దాసరి రమేష్, అరుణ్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.