epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ అమలు

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ప్రజా పాలనను ప్రజలకు చేరువ చేసే దిశగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం అమలుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ కే. రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో ప్రజలకు అందించే సమాచారం ఒకే విధంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా వివరించాలని చెప్పారు. గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీ, మంత్రుల వరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశంతో గ్రామసభలు ప్రారంభించాలని, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు గ్రామంలో ప్రకటించాలని తెలిపారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపుసెట్లు వంటి పథకాలపై లబ్ధిదారుల అనుభవాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంతో పాటు పాలు లేదా రాగి జావా అందించే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే సానుకూల అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి విడుదల చేసిన నిధులను సమర్థంగా వినియోగించాలని తెలిపారు.
గ్రామసభలకు మంచి స్పందన
సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందన్నారు. అదే ఉత్సాహంతో ఏప్రిల్ 2న గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రతి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై నివేదికలు సమర్పించాలని, ప్రజల భాగస్వామ్యం పెరగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను వివరించాలని సూచించారు.
అలాగే సాగు పద్ధతుల్లో మార్పులు, పంట మార్పిడి, యూరియా వినియోగం తగ్గింపు, ఆర్గానిక్ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామసభల తరహాలో మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని, ప్రజల అభిప్రాయాలను రికార్డు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీఓ జగదీశ్వర్, డీఆర్‌డీఓ శ్రీధర్, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.