అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏస్
ఒకరి మృతి.. 11 మందికి గాయాలు
కాకతీయ కరీంనగర్ : కరీంనగర్లోని అలుగునూర్ వంతెన సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతుడిని బీహార్కు చెందిన మహమ్మద్ ఉజాలా (20)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారు గజ్వేల్ నుంచి ధర్మారం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా పెద్దపెల్లి,ధర్మారం కటికనపల్లి ప్రాంతంలో నివసిస్తున్న కూలీలు అని సమాచారం.ప్రమాదానికి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


