ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతాం
మార్కెట్ను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
కరీంనగర్ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య
బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం సభ్యులు
కాకతీయ, కరీంనగర్ : “రైతు సంక్షేమమే ధ్యేయంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం” అని మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఆకుల నరసయ్య వెల్లడించారు. శుక్రవారం కరీంనగర్ మార్కెట్ యార్డులో ఆయన నూతన పాలకవర్గ సభ్యులతో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు హాజరై చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం చైర్మన్ ఆకుల నరసయ్య విలేకరులతో మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు అండగా ఉంటామని, ఏవైనా సమస్యలు ఎదురైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో మార్కెట్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న వెలిచాల రాజేందర్రావు సూచనలతో మార్కెట్ కమిటీని ముందుకు నడిపిస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి పొన్నంకు శుభాకాంక్షలు..
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కట్టరాంపూర్ హనుమాన్ ఆలయంలో చైర్మన్ ఆకుల నరసయ్య, కార్పొరేటర్ ఆకుల నర్మద ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్లో మంత్రి పొన్నంను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

