epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధ‌ర‌ల‌ పెంపుతో ప్రజల నడ్డి విరిస్తున్న కేంద్రం!

ధ‌ర‌ల‌ పెంపుతో ప్రజల నడ్డి విరిస్తున్న కేంద్రం!
కార్పొరేట్‌లకు లాభాలు.. సామాన్యులకు భారాలు 
విడతల వారీగా ధ‌ర‌లు పెంచుతూ కేంద్రం కుట్ర
: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారం మోపుతోందని శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కేవలం నాలుగు రోజుల్లోనే లీటరుకు రూ.4 చొప్పున ధరలు పెంచడం ప్రజల నడ్డి విరిచే చర్య అని పేర్కొన్నారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతుందని హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
విడతల వారీగా పెంచుతూ కుట్ర
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ మాటల గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తూ సామాన్యులపై భారం మోపుతోందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి, విడతల వారీగా పెంచుతూ మోసగిస్తున్నారని, ఈ కుట్రను ప్రజలు గమనించాలని కోరారు. సరైన సమయంలో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
నీట్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్ ఘటనపై కూడా కేంద్ర ప్రభుత్వంపై నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా 26 లక్షల మంది, రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని, దీనికి బాధ్యత వహిస్తూ బీజేపీ నాయకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లీకుల మాదిరిగానే ప్రస్తుతం కేంద్రంలోనూ పరిస్థితి తయారైందని ఆరోపించారు. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాజొద్దీన్, పిట్టల రవీందర్, మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, జగన్ రెడ్డి, పర్వతం మల్లేశం, వరాల నర్సింగం, చాడగొండ బుచ్చిరెడ్డి, టెల భూమయ్య, సరిల్ల ప్రసాద్, బాలరాజు, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, మ్యాకల నర్సయ్య, బత్తిని చంద్రయ్య, సుదర్శన్, మాసుం ఖాన్, శ్రీధర్ రెడ్డి, షెహెన్షా, భారీ, బషీర్, ఖలీల్, జమీల్, హనీఫ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.