మృతుడి కుటుంబానికి అండగా సర్పంచ్
కాకతీయ, సింగరేణి: మండలంలోని అప్పాయిగూడెం పంచాయతీ భిక్య తండాలో అనారోగ్యంతో మృతి చెందిన బాదావత్ రాములు కుటుంబానికి సర్పంచ్ దండు ప్రవీణ్ అండగా నిలిచారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు సర్పంచ్ మృతుడి కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేసి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న తులస్య తండా శివారులోని స్మశానవాటికను సర్పంచ్ దండు ప్రవీణ్ చొరవతో తిరిగి వినియోగంలోకి తెచ్చారు. ఆదివారం మృతి చెందిన బాదావత్ రాములు దహన సంస్కారాలను ఇక్కడే నిర్వహించారు. స్మశానవాటికలో మౌలిక సదుపాయాలను త్వరలోనే మెరుగుపరుస్తామని సర్పంచ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సకాలంలో సాయం అందించి, గ్రామాభివృద్ధిలో చురుగ్గా వ్యవహరిస్తున్న సర్పంచ్ ప్రవీణ్ను గ్రామస్తులు అభినందించారు.

