- మెడికవర్ ఆస్పత్రి నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్
కాకతీయ, కరీంనగర్: ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రాణాపాయ స్థితి రోగుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నప్పుడు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ (సీఆర్ఆర్టీ) అత్యంత ప్రభావవంతమైన చికిత్సా విధానమని మెడికవర్ ఆస్పత్రి నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్ తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీఆర్ఆర్టీ ద్వారా 24 గంటలపాటు నిరంతరాయంగా రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగించడం వల్ల కీలక అవయవాలపై ఒత్తిడి తగ్గి రోగులు కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.మెడికవర్ ఆస్పత్రిలో సీఆర్ఆర్టీ యంత్రం ద్వారా పలువురు ప్రాణాపాయ స్థితి రోగులకు విజయవంతంగా చికిత్స అందించామని, అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఈ విధానం అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

