epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫీజు బకాయిలు చెల్లించండి

ఫీజు బకాయిలు చెల్లించండి
లేదంటే మరో ఉద్యమమే!
రేవంత్‌ సర్కారుపై ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం
ఆర్థిక ఇబ్బందుల‌తో విద్యార్థులు, తల్లిదండ్రులు స‌త‌మ‌తం
కాంగ్రెస్‌ కార్యకర్తల్లోనే రేవంత్‌ తీరుపై అసంతృప్తి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు వదిలిపెట్టం
ఎంపీ ఈటల రాజేందర్ ధ్వ‌జం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూముల అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు సమకూరుతున్నా.. పేద విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వానికి మనసు రావడం లేదా అని ప్రశ్నించారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పొరపాటున రేవంత్‌రెడ్డికి ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారని ఈటల పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే రేవంత్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ‘‘రేవంత్‌ మా పార్టీలోకి ఉడుం లెక్క చేరిండు.. మరో 20 ఏళ్లు కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేశాడు’’ అని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు.

ఫీజులు చెల్లించకపోతే పిల్లలు ఏం కావాలి?

పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారని ఈటల రాజేందర్‌ అన్నారు. కూలి చేసుకునే వారు, ఆటోలు నడిపేవారు, కూరగాయలు అమ్ముకునే వారి పిల్లలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నమ్మకంతో కళాశాలల్లో చేరారని చెప్పారు. చదువులో చేరిన తర్వాత ఫీజులు చెల్లించబోమంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎటు వెళ్లాలని ప్రశ్నించారు. బకాయిలు రాక కళాశాలలు సిబ్బంది జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈటల ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని, వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు.

విదేశీ యూనివర్సిటీలతో ప్రయోజనమేంటి?

తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేసినంత మాత్రాన రాష్ట్రం బాగుపడదని ఈటల అన్నారు. తెలంగాణలో చదువుకున్నవారే ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థానాలకు ఎదిగారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శాంతను నారాయణ్‌ అడోబ్‌ సీఈవోగా, సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ సీఈవోగా, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా ఎదిగారని గుర్తుచేశారు. అరవింద్‌ కృష్ణ, రవికుమార్‌, అజయ్‌ బంగా, ఇంద్రా నూయి, వివేక్‌ మూర్తి, రాజ్‌ సుబ్రహ్మణ్యం తదితరులు భారతదేశంలో చదువుకున్న వారేనన్నారు. స్కైరూట్‌ వంటి సంస్థల ద్వారా ఆకాశాన్ని జయిస్తున్నది కూడా తెలంగాణ యువతేనని చెప్పారు. విద్యతోనే సమానత్వం సాధ్యమని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పారని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని కొఠారి పేర్కొన్నారని ఈటల గుర్తుచేశారు. విద్యార్థుల మేధస్సు వికసిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం విశ్వసించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులతో మాట్లాడి వారి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

మెడలు వంచాల్సిన సమయం వచ్చింది

రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజలకు తల్లిదండ్రి లాంటి వారని ఈటల అన్నారు. ఆ బాధ్యతను రేవంత్‌రెడ్డి విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తోలుమందం అయ్యింది. మెడలు వంచాల్సిన సమయం వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. రైతుబంధు అందక 60 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు, ఆటోడ్రైవర్లు తదితర వర్గాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలు, కార్మికులు, రైతుల పిల్లలు కూడా ఉన్నతంగా చదువుకోవాలన్నదే బీజేపీ పోరాటమని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వసూలు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి తనకు అనుకూలంగా పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఈటల ఆరోపించారు. అయితే ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. ‘‘సోయి లేని ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ హయాంలోని బకాయిలు చెల్లించబోమని చెప్పడం సరికాదని అన్నారు. పార్టీలు వస్తాయి.. పోతాయి.. ప్రభుత్వాలు శాశ్వతమని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయనే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నామని, మరో ఉద్యమం చేసే పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించాలని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.