epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ పెట్టండి

రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ పెట్టండి
వరంగల్ డిక్లరేషన్ అమలులో ప్ర‌భుత్వం విఫ‌లం
ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు
50 రోజులైనా ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్ల‌లో జమ కాలేదు
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను వెంటనే పునరుద్ధరించాలి
: బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్

కాక‌తీయ‌, చింతకాని : ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న సభ ‘రైతు ఆశీర్వాద సభ’ కాదని, అది రైతులకు క్షమాపణ చెప్పే సభగా మార్చాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం చింతకానిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రైతు భరోసా పేరుతో సభలు పెట్టి రైతులను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక గ్రామంలో అయినా ప్రతి రైతుకూ పూర్తి స్థాయిలో రైతు భరోసా అందిందని సీఎం గానీ, మంత్రులు గానీ నిరూపిస్తే వారిని అభినందిస్తామని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు సాయం, రూ. 2 లక్షల రుణమాఫీ వంటి హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు.

ధాన్యం అమ్మి 50 రోజులు దాటినా పైసల్ రాలేదు

రైతుల నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత 50 రోజులు గడిచినా నేటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని లింగాల కమల్ రాజ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రతి గింజను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేశామని, కానీ నేడు బకాయిలు చెల్లించకుండా రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. రైతు భరోసా, రైతు బీమా, పంట కొనుగోలు బకాయిలు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రతి సీజన్ ప్రారంభానికి ముందే రైతు బంధు అందేదని, యూరియా కొరత లేకుండా చూశామని గుర్తుచేశారు.

ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. భద్రత తగ్గింపు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని కమల్ రాజ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయడం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కల్పించిన భద్రతను తగ్గించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. నక్సలైట్ ప్రాంతాల్లో విశేష సేవలందించిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు గతంలో ఉన్న భద్రతను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న జరిగే సభకు ముందే రైతుల పంట కొనుగోలు బకాయిలు, రైతు భరోసా, రైతు బీమా పెండింగ్ మొత్తాలను విడుదల చేయాలని, ఆ తర్వాతే సభ నిర్వహించే నైతిక హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి సభ్యుడు మంకెన రమేష్, పార్టీ మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్, నేతలు గడ్డం శ్రీను, అప్పారావు, షబ్బీర్, లాయర్ బాబు, చాపలమడుగు వీరబాబు, షేక్ మీరా సాహెబ్, కోపూరి నవీన్, నాదెండ్ల వెంకటేష్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.