epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి
గణపురం ఆనకట్ట ఆధారంగా వేల ఎక‌రాల సాగు
ప్ర‌భుత్వం ఏ విష‌యం చెప్ప‌కుండా సాగ‌దీత‌
సాధ్యం కాకుంటే క్రాప్ హాలిడే ప్ర‌క‌టించి పరిహారం చెల్లించాలి
మెదక్ జిల్లా రైతాంగం యాసంగిపై అయోమయం
మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

కాక‌తీయ‌, మెదక్ : సింగూరు ప్రాజెక్టు నుంచి గణపురం ఆనకట్టకు సాగునీరు విడుదల చేస్తారా లేదా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. యాసంగి సాగు చేయాలా వద్దా అన్న తీవ్ర సందిగ్ధంలో మెదక్ జిల్లా రైతాంగం కొట్టుమిట్టాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గణపురం ఆన‌కట్టపై ఆధార‌ప‌డి వేల ఎకరాల భూమి సాగ‌వుతోంద‌న్నారు. పాపన్నపేట, హవేలీఘన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాల్లోని వేలాది ఎకరాల వ్యవసాయం పూర్తిగా గణపురం ఆనకట్టపై ఆధారపడి ఉందన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై స్పష్టత లేకపోవడం రైతుల్లో ఆందోళన పెంచుతోందన్నారు.

వేసవిలో చేయాల్సిన పనులు ఇప్పుడు ఎందుకు?

సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు వేసవిలో చేయాల్సి ఉండగా, ఇప్పుడు చేపట్టడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ పంటను కాపాడుతూ మరమ్మతులు చేయవచ్చని, కానీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాట్ల సమయం దగ్గర పడుతున్నా అధికారులు స్పందించకపోవడంతో రైతులు గత్యంతరం లేక మళ్లీ బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో బోరు బండి మాయమైతే, రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు.

నీటి విడుదల లేకపోతే క్రాప్ హాలిడే
సింగూరు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. తక్షణమే గణపురం ఆనకట్టకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు తగిన నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు పంటలకు నీళ్లు అందించి రైతులు హైదరాబాద్‌కు వలస వెళ్లకుండా చూసిన ఘనత ఉందన్నారు. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను మళ్లించి కూడా పంటలను కాపాడినట్టు గుర్తు చేశారు.

రూ.1800 కోట్ల బోనస్ బకాయిలు

రుణమాఫీ, రైతుబంధు, బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఏడుపాయల సాక్షిగా రుణమాఫీ చేస్తానన్న సీఎం ఇప్పటివరకు కేవలం 40 శాతం మందికే పూర్తి చేశారని విమర్శించారు. గత యాసంగి, ఈ వానాకాలం కలిపి రైతులకు రావాల్సిన సుమారు రూ.1800 కోట్ల బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి యాప్‌లు, మ్యాప్‌లు కాదని… నీళ్లు, కరెంటు, ఎరువులు కావాలని హరీష్ రావు స్పష్టం చేశారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు, మహిళా రైతులు యాప్‌లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఇది రైతులను వేధించేందుకే చేస్తున్న నాటకమని ఆరోపించారు. కొత్త చట్టాల పేరుతో కౌలు రైతులు, యజమానుల మధ్య పంచాయతీలు పెడుతున్నారని ఆరోపించారు. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగా ఫెర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలని, బోనస్ బకాయిలు చెల్లించాలని, రైతుబంధు విడుదల చేయాలని, గణపురం ఆనకట్ట నీటిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.