పిన్న వయసులోనే డీడీ స్థాయికి అశోక్ కుమార్
కాకతీయ,శంకరపట్నం: పిన్న వయసులోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందిన గుగులోతు అశోక్ కుమార్ అభినందనలకు పాత్రుడని క్రీడా సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఆదివారం తాడికల్ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా అశోక్ కుమార్ను తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, జిల్లా టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొరిమి సంతోష్, టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ బాధ్యులు బుద్ధార్థి సంపత్లు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ముందుగా జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారిగా విధులు నిర్వహించిన అశోక్ కుమార్ ఇటీవల డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఆయన కృషి, పట్టుదల, అంకితభావం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని సంఘాల ప్రతినిధులు కొనియాడారు. యువ వయసులోనే ఉన్నత స్థానం అధిరోహించడం గర్వకారణమని పేర్కొంటూ, క్రీడా రంగ అభివృద్ధికి ఆయన నాయకత్వం మరింత ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సత్కారం సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత తమ లక్ష్యాల సాధన కోసం కష్టపడి ముందుకు సాగాలని సూచించారు.

