యాదవ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శిగా అనిల్ కుమార్
కాకతీయ, శంకరపట్నం: యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన పల్లెవేని అనిల్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. యాదవులు, బీసీల సామాజిక మరియు రాజకీయ చైతన్యం కోసం అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషిని, ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. తనపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్కు అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పరశురాములు, మండల అధ్యక్షుడు ఐలయ్య, గొర్ల కొమురయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యాదవులు, బీసీల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తాను. సంఘం బలోపేతానికి పూర్తి అంకితభావంతో పని చేస్తాను” అని పేర్కొన్నారు.

