క్యాంపు విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
: సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి
60 మంది విద్యార్థులకు దుస్తుల బహూకరణ
కాకతీయ,ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని (సమ్మర్ క్యాంప్ను) నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు మంగళవారం ఉచితంగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. కరీంనగర్కు చెందిన నోవా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ రఘురాం రెడ్డి, గాలిపల్లి సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి సంయుక్తంగా రూ.20 వేల విలువైన క్రీడా దుస్తులను 60 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మశ్రీనివాస్, ఉప సర్పంచ్ రావుల శ్రీకాంత్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయుడు సానబాబు పాల్గొన్నారు.

