ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్
సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ 4వ మహాసభలో ఏకగ్రీవ ఎన్నిక
కాకతీయ, చేర్యాల : సీపీఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్ ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ 4వ మహాసభ కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ, సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రత వంటి అంశాలపై నిరంతరం పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. అశోక్ నియామకం పట్ల పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థవంతంగా పనిచేయాలని పార్టీ, ఏఐటీయూసీ నాయకులు ఆకాంక్షించారు.

