epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భక్తి బాటలో.. అభివృద్ధి జాడలో

  • రూ.249.40 కోట్లతో శ‌ర‌వేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు
  • తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు శ్రీకారం
  • గుడి చెరువు బండ్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు
  • భీమేశ్వర ఆలయంలో వరుణయాగానికి శ్రీకారం
  • భక్తులకు మెరుగైన వసతులే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
  • రాష్ట్ర సస్యశ్యామలత కోసం ప్రత్యేక ప్రార్థనలు

కాకతీయ, వేములవాడ : ఒకవైపు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మరోవైపు రాష్ట్ర సస్యశ్యామలత కోసం వైదిక క్రతువులు.. ఇలా అభివృద్ధి, ఆధ్యాత్మికత కలగలిసిన విశిష్ట ఘట్టానికి గురువారం దక్షిణకాశి వేములవాడ వేదికైంది.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 45 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 10 నుంచి 12 నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్నదాన సత్రం, 80 అడుగుల రహదారి విస్తరణ, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

బస్‌స్టేషన్ ఆధునీకరణ.. కొత్త బస్సుకు ప్రారంభం

తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు రూ.1.62 కోట్లతో మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ–కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, భక్తుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు, మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో అభివృద్ధి చేసిన గుడి చెరువు బండ్ పార్క్‌ను మంత్రులు ప్రారంభించారు. భారీ శివుడి విగ్రహం, నటరాజ స్వామి విగ్రహం, సప్తమాతృకల విగ్రహాలు, ఉద్యానవనాన్ని పరిశీలించారు. ఈ పార్క్ భక్తులు, పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

సస్యశ్యామల తెలంగాణ కోసం వరుణయాగం

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించే సత్వర సద్యఃసువృష్టి వరుణయాగాన్ని ప్రారంభించారు. ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ పర్జన్య జపం, హవనాలు, సంతత ధారాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేములవాడ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.వరుణయాగం సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి రైతులకు సాగునీరు పుష్కలంగా అందాలని, తెలంగాణ సస్యశ్యామలంగా విలసిల్లాలని మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.